Friday, February 5, 2010
డీజీపీ వ్యవహారంలో క్యాట్ తీర్పుపై హైకోర్ట్ స్టే
హైదరాబాద్, ఫిబ్రవరి 5 : డిజిపి పదోన్నతి వ్యవహారంపై కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్) ఇచ్చిన తీర్పును హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను పరిశీలించిన న్యాయస్థానం క్యాట్ తీర్పుపై స్టే విధించి ఆరు వారాల పాటు విచారణ వాయిదా వేసింది. తనను డిజిపి పదవి నుంచి తొలగించి డిమోషన్ ఇవ్వడం, సీనియారిటీ ప్రాతిపాదిక లేకుండా గిరీష్కుమార్కు పదోన్నతి కల్పించడంపై యస్.యస్.పి. యాదవ్ వేసిన పిటిషన్ను పరిశీలించిన క్యాట్ డిజిపిగా గిరీష్కుమార్ నియామకం చెల్లదని తీర్పు చెప్పింది. ఉన్నతస్థాయి కమిటి వేసి రెండు వారాల్లో ముగ్గురు సీనియర్లతో జాబితా రూపొందించి, కొత్త డిజిపిని నియమించాలని ఆదేశించింది. అలాగే యాదవ్కు తగ్గించిన వేతనాన్ని తిరిగి చెల్లించాలని స్పష్టం చేసింది. క్యాట్ ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్ చేసింది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment