రాహుల్ రూటే సెపరేటు...


ముంబై, ఫిబ్రవరి 5 : కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ శివసేన హెచ్చరికలను ఏ మాత్రం ఖాతరు చేయకుండా తన పద్ధతిలో తాను వ్యవహరించారు. శుక్రవారం నాడు రాహుల్ ముంబైలో పర్యటించనున్న సందర్భంగా శివసేన నల్లజెండాలతో నిరసన ప్రదర్శన తలపెట్టింది. సేన ఆందోళన కార్యక్రమాలను పట్టించుకోని రాహుల్ తన చుట్టూ ఉన్న భద్రతా వలయాన్ని సైతం పట్టించుకోలేదు. ఎక్కడ పడితే అక్కడ ఆగుతూ, స్వేచ్ఛగా అందరితోనూ కలిసి కలుపుగోలుగా వ్యవహించారు. మధ్యలో ఆయన రెండు లోకల్ సబర్బన్ రైళ్ళలో కూడా ప్రయాణించారు. ఆయన రెండవ తరగతిలో ప్రయాణించడంతో అప్పటికే రైలు పెట్టెలో ఉన్న ప్రయాణీకులు రాహుల్ దగ్గరకు వచ్చి కబుర్లు చెప్పారు. కొందరు ఆటోగ్రాఫ్ అడిగితే, రాహుల్ వారందరికీ ఆటోగ్రాఫ్‌లు ఇచ్చి సమస్యలు ఏమిటో చెప్పమని అడిగి మరీ తెలుసుకున్నారు. ముంబైలో ఒక ోట రాహుల్ ఆగి ఎ.టి.ఎం.లో డబ్బులు 'డ్రా' చేశారు. ఒక చోట అంబేద్కర్ విగ్రహం కనిపిస్తే అక్కడ ఆగి నివాళి అర్పించారు. ఒక చోట యువకులతో మాట్లాడుతూ విదర్భకంటేనూ, తెలంగాణ కంటేనూ ముందు "మనమంతా భారతీయులం'' అని రాహుల్ వ్యాఖ్యానించారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు