రోశయ్య రచ్చబండ

శ్రీకాకుళం,జనవరి 23: శ్రీకాకుళం జిల్లా రెండు రోజుల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రోశయ్య శనివారం నాడు వీరఘట్టం మండలం చిదిమి గ్రామస్తులతో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. తమకు తాగునీరు, వైద్య, బస్సు సౌకర్యాలు కల్పించాలని గ్రామస్థులు సీఎంను కోరారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ 1952 నుంచి శ్రీకాకుళం జిల్లాతో తనకు విడదీయరాని అనుబంధం ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయో, లేదోనని తెలుసుకునేందుకే ఈ పర్యటన అని సీఎం స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీ దేశంలోనే గొప్ప పథకమని దీనిద్వారా ఎంతోమంది లబ్ధిపొందారని ఆయన అన్నారు.దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి చిరకాల వాంఛ గా మిగిలిన రచ్చబండ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు