Saturday, January 23, 2010
రోశయ్య రచ్చబండ
శ్రీకాకుళం,జనవరి 23: శ్రీకాకుళం జిల్లా రెండు రోజుల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రోశయ్య శనివారం నాడు వీరఘట్టం మండలం చిదిమి గ్రామస్తులతో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. తమకు తాగునీరు, వైద్య, బస్సు సౌకర్యాలు కల్పించాలని గ్రామస్థులు సీఎంను కోరారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ 1952 నుంచి శ్రీకాకుళం జిల్లాతో తనకు విడదీయరాని అనుబంధం ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయో, లేదోనని తెలుసుకునేందుకే ఈ పర్యటన అని సీఎం స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీ దేశంలోనే గొప్ప పథకమని దీనిద్వారా ఎంతోమంది లబ్ధిపొందారని ఆయన అన్నారు.దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి చిరకాల వాంఛ గా మిగిలిన రచ్చబండ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment