Saturday, January 30, 2010

ఫిభ్రవరి 15 నుంచి అసెంబ్లీ


హైదరాబాద్,జనవరి 30: వచ్చే నెల (ఫిబ్రవరి) 15వ తేదీ నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. సమావేశాల సందర్భంగా ఫిబ్రవరి 20న సభలో బడ్జెట్ ప్రవేశపెట్టే తీర్మానాన్ని ఆమోదించింది. ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య అధ్యక్షతన సచివాలయంలో శనివారం ఉదయం జరిగిన మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. మంత్రివర్గ సమావేశం అనంతరం క్యాబినెట్ నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి డాక్టర్ జె.గీతారెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. ఉద్యోగుల జీతాలకు సంబంధించి పిఆర్సీని అమలు చేసేందుకు క్యాబినెట్ పచ్చజెండా ఊపింది. రెండో విడతగా తొమ్మిది జిల్లాల్లో కుటుంబ న్యాయస్థానాల ఏర్పాటుకు సంబంధించిన తీర్మానాన్ని మంత్రివర్గం ఆమోదించింది. నల్సార్ విశ్వవిద్యాలయంలో రాష్ట్రానికి చెందిన విద్యార్థులకు 20 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ, ఎయిడెడ్ డిగ్రీ కళాశాలల అధ్యాపకులకు 2006లో పెంచిన యుజిసి స్కేలు మేరకు జీతాలు చెల్లించాలని తీర్మానించింది. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో 21 పాలిటెక్నిక్ కళాశాలలకు 20 కోట్ల రూపాయల వ్యయంతో పక్కా భవనాలు నిర్మించాలని క్యాబినెట్ నిర్ణయించింది. చేనేత కర్మికులకు పావలా సబ్సిడీ పరిమితి ని 15000 రూపాయల నుంచి 100000 రూపాయలకు పెంచాలని నిర్ణయించింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...