Friday, January 29, 2010
రంగుల మాయాబజార్ కు పన్ను మినహాయింపు
హైదరాబాద్,జనవరి 29: శనివారం నాడు విడుదల అవుతున్న రంగుల మాయాబజార్ చిత్రానికి రాష్ట్రప్రభుత్వం వినోదపు పన్ను మినహాయింపు ప్రకటించింది. తొలి విడుదల నుంచి ఏడాది పాటు ఈ పన్ను మినహాయింపు వర్తిస్తుంది. సాంకేతిక విలువలు అంతగా లేని రోజుల్లోనే ‘మాయాబజార్’ చిత్రాన్ని ఓ అద్భుత కళాఖండంగా తీర్చిదిద్దిన ఘనత చిత్ర దర్శకుడు కె.వి.రెడ్డి, నిర్మాతలు నాగిరెడ్డి, చక్రపాణిలకు దక్కుతుంది. 1957లో నిర్మించిన ఈ బ్లాక్ అండ్ వైట్ చిత్రాన్ని ఇప్పుడు గోల్ట్ స్టోన్ టెక్నాలజీ సంస్థ రంగుల్లోకి మార్చింది. సూపర్ గుడ్ ఫిలింస్ ఈనెల 30న ఆంధ్రదేశమంతటా ఈ చిత్రాన్ని విడుదల చేస్తోంది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment