Friday, January 29, 2010

రంగుల మాయాబజార్ కు పన్ను మినహాయింపు

హైదరాబాద్,జనవరి 29: శనివారం నాడు విడుదల అవుతున్న రంగుల మాయాబజార్ చిత్రానికి రాష్ట్రప్రభుత్వం వినోదపు పన్ను మినహాయింపు ప్రకటించింది. తొలి విడుదల నుంచి ఏడాది పాటు ఈ పన్ను మినహాయింపు వర్తిస్తుంది. సాంకేతిక విలువలు అంతగా లేని రోజుల్లోనే ‘మాయాబజార్’ చిత్రాన్ని ఓ అద్భుత కళాఖండంగా తీర్చిదిద్దిన ఘనత చిత్ర దర్శకుడు కె.వి.రెడ్డి, నిర్మాతలు నాగిరెడ్డి, చక్రపాణిలకు దక్కుతుంది. 1957లో నిర్మించిన ఈ బ్లాక్ అండ్ వైట్ చిత్రాన్ని ఇప్పుడు గోల్ట్ స్టోన్ టెక్నాలజీ సంస్థ రంగుల్లోకి మార్చింది. సూపర్ గుడ్ ఫిలింస్ ఈనెల 30న ఆంధ్రదేశమంతటా ఈ చిత్రాన్ని విడుదల చేస్తోంది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...