Friday, October 14, 2022

ఏ టి ఎం ఇడ్లీ రెడీ..

https://youtube.com/shorts/1K9rVUcV4rs?feature=share 

బెంగుళూరు, అక్టోబర్ 14: 

వేడి వేడి ఇడ్లీలు అందించే ఏటీఎంలు అందుబాటులోకి వచ్చాయి. బెంగుళరులో ఒక స్టార్టప్‌ కంపెనీ ‘ఇడ్లీ ఏటీఎం’లను ఏర్పాటు చేసింది. బెంగళూరుకు చెందిన శరణ్ హిరేమత్, సురేష్ చంద్రశేఖరన్‌లు స్థాపించిన స్టార్టప్ ఫ్రెషప్ రోబోటిక్స్, ఇన్‌స్టెంట్‌ ఇడ్లీ తయారు యంత్రాన్ని రూపొందించింది. ఇరవై నాలుగు గంటలు వేడి వేడి ఇడ్లీలు అందించే ఈ ఏటీఎంను ఫ్రెషాట్‌లో ఏర్పాటు చేశారు. ఇది కేవలం 12 నిమిషాల్లో 72 ఇడ్లీలు తయారు చేయగలదు. చట్నీ, కారప్పొడి వంటి వాటితో ఇడ్లీలను ప్యాక్‌ చేసి కస్టమర్లకు అందిస్తుంది.ఏటీఎం వద్ద ఉన్న క్యూఆర్‌ కోడ్‌ను మొబైల్‌ ఫోన్‌తో స్కాన్ చేయాలి. దీంతో మెనూ కనిపిస్తుంది. ఇడ్లీలు ఆర్డర్‌ చేసి డబ్బులను ఆన్‌లైన్‌లో చెల్లించాలి. దీంతో నిమిషంలోపే చట్నీతో కూడిన ఇడ్లీ ప్యాక్‌ ఆ ఏటీఎం నుంచి బయటకు వస్తుంది. 

2016లో తన కుమార్తె అనారోగ్యంతో బాధపడినప్పుడు అర్థరాత్రి వేళ ఎక్కడా వేడి వేడి ఇడ్లీలు లభించక ఇబ్బంది పడ్డానని, అందుకే ఇడ్లీలు తయారు చేసే ఏటీఎం యంత్రాన్ని రూపొందించాలన్న ఆలోచన వచ్చిందని శరణ్‌ హిరేమత్‌ తెలిపారు. ప్రస్తుతం బెంగళూరులోని రెండు చోట్ల ఇడ్లీ ఏటీఎంలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వీటిని మరింతగా విస్తరించడంతోపాటు దోస, రైస్‌, జ్యూస్‌ వంటి ఏటీఎంలను కూడా అందుబాటులోకి తెచ్చే యోచనలో ఉన్నట్లు ఆయన వెల్లడించారు. 


No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...