Monday, October 24, 2022

మూరత్​ ట్రేడింగ్​లో దేశీయ స్టాక్ మార్కెట్లకు లాభాలు..

ముంబై , అక్టోబర్ 24: దీపావళి సందర్భంగా జరిగిన మూరత్​ ట్రేడింగ్​లో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. సాయంత్రం 6 గంటల 15 నుంచి 7 గంటల 15 నిమిషాల వరకు సాగిన ట్రేడింగ్​లో.. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజీ 524 పాయింట్ల లాభంతో 59,831 వద్ద ముగించింది. జాతీయ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ సూచీ నిఫ్టీ 17,730 పాయింట్ల వద్ద స్థిరపడింది. స్టాక్‌ మార్కెట్‌లో దీపావళి పర్వదినం రోజు ట్రేడింగ్‌ చేస్తే.. వచ్చే దీపావళి వరకు లాభాల పంట పండుతుందన్నది ఇన్వెస్టర్ల నమ్మకం. అందులో భాగంగానే స్టాక్‌ ఎక్స్ఛేంజీలు ఏటా దీపావళి రోజు ప్రత్యేకంగా మూరత్‌ ట్రేడింగ్‌ను నిర్వహిస్తాయి. ఇది ఒక గంట పాటు కొనసాగుతుంది. స్టాక్‌ ఎక్స్ఛేంజీలే సమయాన్ని నిర్ణయిస్తాయి. ఈ సమయంలో కనీసం ఒక్క స్టాక్‌ అయినా కొనాలని చాలామంది ట్రేడర్లు సెంటిమెంట్‌గా పెట్టుకుంటారు. 


No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...