Monday, October 10, 2022

హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో రూ.700 కోట్లతో జంతు వ్యాక్సిన్ తయారీ యూనిట్

హైదరాబాద్, అక్టోబర్ 10: హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో రూ.700 కోట్లతో జంతు వ్యాక్సిన్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్ సంస్థ (ఐఐఎల్) ప్రకటించింది. ఆ సంస్థ ప్రతినిధులు సమావేశమయ్యారు. పాదాలు, నోటి ద్వారా పశవులకు సంక్రమించే వ్యాధులు, ఇతర వ్యాధులకు సంబంధించిన టీకాల ఉత్పత్తి కోసం కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ ప్రతినిధులు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్​తో జరిపిన సమావేశంలో తెలిపారు. ఐఐఎల్ ఎండీ ఆనంద్ కుమార్, ఇతర ప్రతినిధులు తమ సంస్థ విస్తరణ ప్రణాళికలు వివరించారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే ఈ కేంద్రంతో 750 మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. అత్యాధునిక సౌకర్యాలతో బయో సేఫ్టీ లెవల్ 3 ప్రమాణాలతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. గచ్చిబౌలిలో ప్రస్తుతం ఉన్న తయారీ కేంద్రం సంవత్సరానికి 300 మిలియన్ డోస్​ల సామర్థ్యాన్ని కలిగి ఉందని చెప్పారు. కొత్తగా ఏర్పాటు చేయబోతున్న ఈ వ్యాక్సిన్ తయారీ కేంద్రంతో ఇప్పటికే సంస్థకు ఉన్న సామర్థ్యానికి అదనంగా సంవత్సరానికి మరో 300 మిలియన్ డోసుల వ్యాక్సిన్ ఉత్పత్తి అవుతుందని వివరించారు. 






No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...