Saturday, January 2, 2021

తొలి విడతలో మూడు కోట్ల మందికి ఉచిత కరోనా టీకా

 న్యూఢిల్లీ,జనవరి 2:: దేశవ్యాప్తంగా తొలివిడతలో మూడు కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ ఉచితంగా అందజేస్తామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు.  . ఢిల్లీలో పలు ప్రదేశాల్లో వ్యాక్సిన్ డ్రైరన్ జరుగుతున్న తీరును ఆయన స్వయంగా పరిశీలించారు. తొలివిడత వ్యాక్సినేషన్‌లో భాగంగా అత్యంత ప్రాధాన్యం కలిగిన కోటి మంది వైద్యారోగ్య సిబ్బందికి, రెండు కోట్ల ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు ఉచితంగా టీకా ఇస్తామని చెప్పారు. తదుపరి 27 కోట్ల మందికి వ్యాక్సిన్‌ ఎలా అందించాలనే దానిపై నిర్ణయానికి వస్తాంస్ని తెలిపారు. కొవిషీల్డ్‌ టీకా అత్యవసర వినియోగానికి కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ నిపుణుల బృందం ఆమోదం తెలిపిన తరుణంలో కేంద్ర మంత్రి ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.



No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...