Saturday, January 2, 2021

పాపం.. నెమళ్ళు

జైపూర్, జనవరి 2; రాజస్థాన్​లోని నాగౌర్ జిల్లాలో 53 నెమళ్లు అనుమానస్పద రీతిలో మృతి చెందాయి. మరో 26 గాయపడ్డాయి. ఈ ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేపడుతున్నామని అధికారులు వెల్లడించారు.మృతిచెందిన నెమళ్లను నాగౌర్ జిల్లా ఎస్పీ దీద్వన సంజయ్ గుప్తా, అటవీ శాఖ అధికారుల సమక్షంలో ఖననం చేశారు. కొద్ది రోజుల క్రితం జోధ్​పుర్ జిల్లా ఝలావాడ్​ లో ఇలాగే 100 కాకులు నేల రాలాయి. ఈ ఘటనకు బర్డ్​ ఫ్లూ కారణమని నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ హై-సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ లాబోరేటరీ నిర్ధారించింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...