హైదరాబాద్,డిసెంబర్ 27; బిగ్బీ అమితాబ్ బచ్చన్ అక్కినేని జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు ఈ పురస్కారాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, సినీనటుడు నాగార్జున తదితరులు పాల్గొన్నారు.
కె.సి. ఆర్ . ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలుగు సినీ పరిశ్రమను మరింత అభివృద్ధి చేయాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. చిత్ర పరిశ్రమను హైదరాబాద్ నుంచి తరలిపోనివ్వబోమని ఆయన స్పష్టం చేశారు .త్వరలోనే సినీ ప్రముఖులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి సినీ పరిశ్రమ అభివృద్ధిపై చర్చిస్తామన్నారు.
కె.సి. ఆర్ . ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలుగు సినీ పరిశ్రమను మరింత అభివృద్ధి చేయాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. చిత్ర పరిశ్రమను హైదరాబాద్ నుంచి తరలిపోనివ్వబోమని ఆయన స్పష్టం చేశారు .త్వరలోనే సినీ ప్రముఖులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి సినీ పరిశ్రమ అభివృద్ధిపై చర్చిస్తామన్నారు.
No comments:
Post a Comment