హైదరాబాద్ ,నవంబర్ 15: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే కాలె యాదయ్య తెరాసలో చేరారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో యాదయ్య తెరాస తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... చేవెళ్ల , శంకర్పల్లిలో ప్రభుత్వ ఆస్పత్రులు కడుతామని హామీ ఇచ్చారు. కొత్తగా వచ్చిన తెలంగాణలో ప్రజలు కోటి ఆశలతో ఉన్నారని వారి ఆశలను నెరవేర్చుతామని అన్నారు. తెలంగాణకు లక్షల కోట్ల విలువ చేసే భూములున్నాయని వాటిని చెర విడిపిస్తే బంగారు తెలంగాణ సాధించుకోవచ్చని వివరించారు. 3 సంవత్సరాల తర్వాత తెలంగాణలో కన్నురెప్పపాటు కూడా కరెంట్ పోనీయమని వెల్లడించారు. 4 సంవత్సరాల్లోగా ప్రతీ ఇంటికి మంచినీటి నల్లా కనెక్షన్ ఇస్తామని తెలిపారు. ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇవ్వకపోతే మళ్లీ ఎన్నికల్లో ఓట్లు వేయాలని అడగమని పునరుద్ఘాటించారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment