Sunday, November 16, 2014

మూడు చోట్ల మెట్రో రూట్ మార్పు..

 హైదరాబాద్, నవంబర్  15; హైదరాబాద్ మెట్ రో రైలు మార్గం అలైన్మెంట్ మార్పుకు ఎల్ అండ్ టి సంస్థ అంగీకరించింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం నాడు ఎల్ అండ్ టి సంస్థ  ప్రతినిధులతో  సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అలైన్మెంట్ మార్చడానికి అంగీకారం కుదిరింది. ఈ మేరకు పాతబస్తీలో ప్రార్థనా మందిరాలు ఉన్న చోట అలైన్మెంట్ను మార్చి మూసీ నది పక్కనుంచి మార్గాన్ని మార్చుతారు. అలాగే సుల్తాన్ బజార్ దగ్గర మార్గాన్ని మార్చి కోఠీ ఉమన్స్ కాలేజీ వెనుక నుంచి మళ్ళిస్తారు. అదేవిధంగా ప్రస్తుతం అసెంబ్లీ ముందు నుంచి వున్న మార్గాన్ని అసెంబ్లీ వెనుక నుంచి తీసుకెళ్తారు. మెట్ రో అలైన్మెంట్ మార్పుకు అయ్యే వ్యయాన్ని భరించడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకరించారు. మెట్రోకి అప్పగించిన స్థలాలను కూడా తిరిగి తీసుకోబోమని కూడా కేసీఆర్ హామీ ఇచ్చారు అలాగే, మొత్తం మెట్రోరైలు మార్గాన్ని కూడా 72 కిలోమీటర్ల నుంచి 200 కిలోమీటర్లకు పెంచడానికి కూడా అంగీకారం కుదిరింది.    

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...