Tuesday, November 11, 2014

కు.ని. ఆపరేషన్లు వికటించి 10 మంది మహిళల మృతి...

బిలాసపూర్‌, నవంబర్‌ 11 : ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బిలాస్ పూర్  లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి 10 మంది మహిళలు మృతి చెందారు. మరో 13 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించింది. పరిస్థితి విషమంగా ఉన్నవారికి రూ.50వేల సాయం అందజేస్తారు .   తాక్తాపూర్‌లో నిర్వహించిన శిబిరంలో 80 మంది మహిళలు శస్త్రచికిత్సలు చేయించుకోగా వారిలో ఉదయం 8మంది మహిళలు మరణించగా తరువాత ఇంకో  ఇద్దరు మరణించారు . 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...