Friday, October 17, 2014

మృత్యువు తో పోరాడుతున్న పాపకు పవన్ పరామర్శ ..

ఖమ్మం, అక్టోబర్‌ 17 : మృత్యువుతో పోరాడుతున్న ఓ చిన్నారి కోరికను నటుడు పవన్‌ కల్యాణ్‌ తీర్చారు. శుక్రవారం జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి శ్రీజను పవన్‌ పరామర్శించారు. అపస్మారకస్థితిలో ఉన్న శ్రీజను చూసి పవన్‌ చలించిపోయారు. శ్రీజ కోలుకున్న తర్వాత హైదరాబాద్‌ తీసుకురావాలని బాలిక తల్లిదండ్రులను కోరారు. శ్రీజ కుటుంబానికి పవన్‌ రూ.2 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. రాజమండ్రిలో కొన్న బొమ్మలను పవన్‌ చిన్నారి శ్రీజకు అందజేశారు. 
 
ఖమ్మం జిల్లా పాల్వంచకు చెందిన శ్రీజ అనే బాలిక తీవ్ర ఆనారోగ్యంతో బాధపడుతోంది. వైద్యం కోసం బాలికను జిల్లాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందజేస్తున్నారు. . ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంచడంతో తాము ఏమీ చేయలేమని వైద్యులు తేల్చిచెప్పారు. అయితే తనకు పవన్‌ కల్యాణ్‌ను చూడాలన్న శ్రీజ కోరికను తల్లిదండ్రులు మేక్‌ ఏ విష్‌ ఫౌండేషన్‌కు తెలియజేశారు. దీంతో పవన్‌ను మేక్‌ ఏ విష్‌ ప్రతినిధులు సంప్రదించి శ్రీజ కోరికను తెలిపారు. దీంతో పవన్‌ ఖమ్మం వచ్చి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీజను పరామర్శించారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...