Monday, October 27, 2014

సియాటెల్ పాఠశాల కాల్పుల్లో ఇద్దరు బాలికల మృతి...


వాషింగ్టన్, అక్టోబర్ 27 : అమెరికాలోని సియాటెల్‌ నగరంలో మేరీస్‌విల్లే- పిల్‌ఛుక్‌ పాఠశాలలో శుక్రవారం జరిగిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన 14ఏళ్ల గియా సోరియానో అనే అమ్మాయి చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందింది. పాఠశాల కేఫెటెరియాలో జైలెన్‌ ఫ్రేబర్గ్‌ అనే విద్యార్థి తుపాకితో విచక్షణా రహితంగా కాల్పులు జరిపి అనంతరం తనను తాను కాల్చుకొని మృతిచెందాడు. ఈ కాల్పుల్లో ఓ విద్యార్థిని అక్కడికక్కడే మృతిచెందగా, తరువాత మరో బాలిక మరణించింది. గాయపడిన మరో ఇద్దరు బాలురు, ఓ బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...