Friday, October 24, 2014

ఆళ్లగడ్డ అసెంబ్లీ ఉప ఎన్నిక ఏకగ్రీవం ...వైసీపీ అభ్యర్థి అఖిలప్రియ ఎన్నిక

కర్నూలు, అక్టోబర్‌ 24 : కర్నూలు జిల్లా, ఆళ్లగడ్డ అసెంబ్లీ ఉప ఎన్నిక ఏకగ్రీవం అయింది. ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకోవడంతో వైసీపీ అభ్యర్థి అఖిలప్రియ ఎమ్మెల్యేగా ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. టీడీపీ, కాంగ్రెస్‌ సహా ఇతర పార్టీలు పోటీకి దూరంగా ఉండడంతో వైసీపీతో పాటు స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు వేశారు. నామినేషన్ల పరిశీలన తర్వాత బరిలో ఉన్న ఇద్దరు స్వతంత్య్ర అభ్యర్ధులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో ఆళ్టగడ్డ ఎమ్మెల్యేగా అఖిల ప్రయ ఎన్నికైనట్లు అధికారులు శుక్రవారం సాయంత్రం ప్రకటించారు. తన ఏకగ్రీవానికి సహకరించిన అన్ని పార్టీల నేతలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసిన భూమా శోభానాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఆళ్లగడ్డలో ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...