హైదరాబాద్,సెప్టెంబర్ 2: పవన్ కళ్యాణ్ అభిమానులకి శుభ వార్త చెబుతానని లోగడ ప్రకటించిన రేణూ దేశాయ్ ఇప్పుడు ఆ విషయం వెల్లడించారు.పవన్ , రెణూదేశాయ్ గారాలబ్బాయి అకీరాను త్వరలో వెండితెరపై చూడవచ్చునని పవన్ పుట్టిన రోజు సెప్టెంబర్ 2న రేణు దేశాయ్ స్వయంగా వెల్లడించారు.
రేణు దేశాయ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన మరాఠీ సినిమాలో అకీరా అతిథి పాత్రలో నటించాడు. అకీరా తెరంగేట్రం గురించి రేణు ట్విట్టర్ లో అభిమానులతో పంచుకున్నారు. 'ఇష్క్ వాలా లవ్ చిత్రంలో అకీరా అతిథి పాత్రలో నటిస్తున్నాడు. నేను దర్శకత్వం వహించి, నిర్మిస్తున్న చిత్రంలో అకీరా వెండితెరకు పరిచయం కావడం ఓ తల్లిగా నాకు ఎంతో సంతోషంగా ఉంది' అని రేణు ట్వీట్ చేశారు. అకీరా గుర్రపు స్వారీ నేర్చుకుంటున్న ఫొటోలను రేణు గతంలో ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. పవన్ తో విడిపోయినా రేణు అతణ్ని ప్రశంసిస్తూ తరచూ సోషల్ మీడియాలో అభిమానులను పలకరిస్తుంటారు.
రేణు దేశాయ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన మరాఠీ సినిమాలో అకీరా అతిథి పాత్రలో నటించాడు. అకీరా తెరంగేట్రం గురించి రేణు ట్విట్టర్ లో అభిమానులతో పంచుకున్నారు. 'ఇష్క్ వాలా లవ్ చిత్రంలో అకీరా అతిథి పాత్రలో నటిస్తున్నాడు. నేను దర్శకత్వం వహించి, నిర్మిస్తున్న చిత్రంలో అకీరా వెండితెరకు పరిచయం కావడం ఓ తల్లిగా నాకు ఎంతో సంతోషంగా ఉంది' అని రేణు ట్వీట్ చేశారు. అకీరా గుర్రపు స్వారీ నేర్చుకుంటున్న ఫొటోలను రేణు గతంలో ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. పవన్ తో విడిపోయినా రేణు అతణ్ని ప్రశంసిస్తూ తరచూ సోషల్ మీడియాలో అభిమానులను పలకరిస్తుంటారు.
No comments:
Post a Comment