Tuesday, August 19, 2014

ముగిసిన "సర్వే" తంతు...... తెలంగాణ అంతటా కర్ఫ్యూ తరహా వాతావరణం

బ్యాంకు, పోస్టాఫీసు ఖాతాల వివరాలు ఇవ్వడానికి   ప్రజల విముఖత  ....
హైదరాబాద్, ఆగస్టు 19: ‘సమగ్ర కుటుంబ సర్వే’ మంగళవారం తెలంగాణ రాష్ట్రంలో  పూర్తి బంద్ వార్తావరణం లో ప్రశాంతంగా ముగిసింది. రాత్రి 9.30 సమయానికి రాష్ట్రవ్యాప్తంగా 95 శాతం సర్వే పూర్తయినట్లు అధికారులకు సమాచారం అందింది. బ్యాంకు, పోస్టాఫీసు ఖాతాల వివరాలు ఇవ్వడానికి చాలావరకు ప్రజలు విముఖత వ్యక్తం చేశారు.  ఎన్యూమరేటర్ల రాక కోసం ప్రజలు వేచిచూడడం, వారు తమ ఇళ్ల వద్దకు రాగానే అవసరమైన పత్రాలు చూపి, నమోదు చేసుకోవడం కనిపించింది. చాలాచోట్ల అనుకున్న సమయానికి సర్వే ప్రారంభం కాలేదు.  జిల్లా, మండలకేంద్రాలు, గ్రామాల్లో సర్వేకు ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన కనిపించింది. సర్వే కోసం ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు కూడా సెలవు ప్రకటించడంతో.. అంతటా కర్ఫ్యూ తరహా వాతావరణం కనిపించింది. నిత్యం భక్తుల రద్దీతో కిటకిటలాడే నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట, కరీంనగర్ జిల్లా వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, ఆదిలాబాద్ జిల్లా బాసర తదితర పుణ్య క్షేత్రాలన్నీ బోసిపోయాయి. ఆదిలాబాద్ జిల్లాలోని 15 భూగర్భ గనులు, నాలుగు ఓపెన్ కాస్టుల్లో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది.సర్వే వల్ల ఉదయం, సాయంత్రం మినహా రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. సర్వే కోసం వారం రోజులుగా ప్రత్యేక బస్సులు నడిపి రూ. 12 కోట్ల ఆదాయం ఆర్జించిన ఆర్టీసీకి, మంగళవారం
జిల్లాల వారీగా నమోదైన శాతాలు..
 జిల్లా                 శాతం
 మహబూబ్‌నగర్         99
 ఖమ్మం                  98
 కరీంనగర్                98
 నల్లగొండ                97
 మెదక్                   96
 ఆదిలాబాద్              96
 నిజామాబాద్            93
 రంగారెడ్డి                89
 వరంగల్                 86
 జీహెచ్‌ఎంసీ             77
కె.సి.ఆర్.హ్యాపీ..
తెలంగాణ సమగ్ర సర్వే ఒక అద్భుతాన్ని ఆవిష్కరించిందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సర్వే మన బాగుకోసం వచ్చిందన్న నమ్మకంతో తెలంగాణ ప్రజలు ఎక్కడెక్కడినుంచో స్వస్థలాలకు తరలివచ్చారని ఆయన చెప్పారు. భివాండి, అహ్మదాబాద్, సూరత్, ఇంకా జెడ్డా, గల్ఫ్‌లనుంచి కూడా ప్రత్యేకంగా తరలివచ్చారని ఆయన చెప్పారు. దేశంలో ఎప్పుడూ ఇంతటి అద్భుతమైన సర్వే జరగలేదని, ఇకముందు అన్ని రాష్ట్రాలూ, యావత్ భారతదేశం ఇటువంటి సర్వేను నిర్వహిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఇప్పటివరకూ హైదరాబాద్ జనాభా గురించి మనం అనుకున్నది వేరు ఇప్పుడు బయటపడుతున్నది వేరు అంటూ హైదరాబాద్ జనాభా దాదాపు ఒక కోటి 20 లక్షలు కావచ్చునని ప్రాథమిక సమాచారాన్నిబట్టి తెలుస్తున్నదని, ఇప్పుడు ఇక్కడ స్థిరపడినవారే గాక పనులమీద వచ్చేవారు కూడా ఉంటారు కాబట్టి తరువాత ఇక్కడి మంచినీళ్ల అవసరం ఎంత అనేది అంచనా వేయడానికి అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. ఇప్పుడు సర్వే పూర్తి అయిపోయింది గనక అన్ని లెక్కలూ నికరంగా తేలతాయని ఆయన అన్నారు. ప్రజా సంక్షేమం కోసం సర్వే చేస్తామంటే చిలవలు పలవలు చేశారని కేసీఆర్ ప్రతిపక్షాలపై మండిపడ్డారు. ప్రతిపక్షాలు  విమర్శలు చేస్తున్నా ఆంధ్ర మిత్రులు కూడా ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారని ఆయన సంతోషంగా చెప్పారు. ఇప్పుడు వచ్చిన సమాచారం ఆధారంగా ఎవరెవరికి ఎక్కడెక్కడ ఎన్నెన్ని ఇళ్లు కట్టాలి, ఏయే సంక్షేమ పథకాలు అమలు చేయాలి మొదలైన అంశాలపై పూర్తి అవగాహన కల్పించే నివేదిక సిద్ధమవుతుందని, ఇది ముఖ్యమంత్రి టేబుల్‌పై ఉంటుంది, సెక్రటరీల టేబుళ్లపై ఉంటుంది, కలెక్టర్ల టేబుల్‌పై ఉంటుంది, ఎంఆర్ఓ టేబుల్‌పై కూడా ఉంటుందని ఆయన చెప్పారు.


రూ. 5 కోట్ల నష్టం వాటిల్లింది. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...