Wednesday, July 2, 2014

తెలంగాణ శాసనమండలి తొలి చైర్మన్‌గా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ స్వామిగౌడ్

హైదరాబాద్, జులై 2 : తెలంగాణ శాసనమండలి తొలి చైర్మన్‌గా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ స్వామిగౌడ్ ఎన్నికయ్యారు. బ్యాలెట్ పద్దతిలో జరిగిన ఓటింగ్‌లో మొత్తం 21 ఓట్లు పోలవగా అన్ని ఓట్లు స్వామిగౌడ్‌కే పడ్డాయి.
మరోవైపు చైర్మన్ ఎన్నికల్లో డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ సహా పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు స్వామిగౌడ్‌కు ఓటేశారు. ఈ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉంది. బుధవారం ఉదయం సభ ప్రారంభంకాగానే శాసనమండలి చైర్మన్ ఎన్నిక ప్రక్రియపై రగడ నెలకొంది. సీక్రెట్ బ్యాలెట్ పద్దతిలో ఎన్నిక నిర్వహించడంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ డీ.శ్రీనివాస్ అభ్యంతరం తెలిపారు. ఇది అప్రజాస్వామికమని ఆయన మండిపడ్డారు.ఎన్నిక ప్రక్రియను వాయిదా వేయాలని డీఎస్ వినతి చేశారు. దీనిపై మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ మండలి నిబంధనల ప్రకారం ముందుకు వెళ్తున్నామని ఆయన సమాధానమిచ్చారు.అనంతరం డీఎస్ మాట్లాడుతున్న సమయంలోనే ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమవడంతో పోడియం వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. చైర్మన్ ఎన్నిక తీరుకు నిరసనగా పోటీ నుంచి తప్పుకుంటున్నామని డీఎస్ ప్రకటిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. అటు టీడీపీ సభ్యులు సైతం పోటీకి దూరంగా ఉంటున్నట్లు ప్రకటిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...