Tuesday, June 24, 2014

ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్

హైదరాబాద్, జూన్ 24 : ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా కేంద్ర వాణిజ్యశాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఒకే ఒక్క నామినేషన్ దాఖలవడంతో నిర్మలా సీతారామన్ ఎన్నిక ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్ జనార్ధన్ రెడ్డి ఆకస్మిక మృతితో ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ స్థానానికి ళీ ఏర్పడింది. పార్లమెంట్ ఉభయ సభల్లో సభ్యురాలు కాకుండానే కేంద్రమంత్రిగా భాద్యతల్ని చేపట్టిన నిర్మలా సీతారామన్ ను బీజేపీ ఆంధ్రప్రదేశ్ నుంచి పోటీకి దింపింది.   నిర్మలా సీతారామన్ కు ఎన్డీఏ భాగస్వామ్య పార్టీ తెలుగుదేశం మద్దతు తెలిపింది. వాస్తవానికి ఎన్నిక జూలై 3 తేదిన జరగాల్సి ఉండగా.. ఈ స్థానానికి ఎవరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో నిర్మలా సీతారామన్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...