Saturday, October 5, 2013

పుత్తూరులో ఇద్దరు ఉగ్రవాదుల అరెస్టు...

తిరుపతి,అక్టోబర్ 5 : చిత్తూరు జిల్లా పుత్తూరులో  శుక్రవారం రాత్రినుంచి కొనసాగిన ఆపరేషన్.. శనివారం సాయంత్రానికి ముగిసింది. ఉగ్రవాదులున్న ఇంటి గోడలను డ్రిల్లింగ్ చేసి  ఉగ్రవాదులు బిలాల్‌, ఇస్మాయిల్ అలియాస్ మున్నాను ఆక్టోపస్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు ఉగ్రవాదులతో పాటు ఒక మహిళ, ముగ్గురు పిల్లలను కూడా అదుపులోకి తీసుకున్నారు.వారిని అంబులెన్స్‌లో చెన్నైకు తరలించారు.  ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన సీఐ లక్ష్మణ్ కు చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నట్లు అదనపు డీఐజీ వీఎస్ కే కౌముది తెలిపారు. కాగా, ఉగ్రవాదులు తిరుమలలో బ్రహ్మోత్సవాల సందర్భంగా పేలుళ్లు జరపడానికి కుట్ర పన్నుతున్నట్లు వచ్చిన కథనాల గురించి మాత్రం తమవద్ద ఎలాంటి సమాచారం లేదని కౌముది చెప్పారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...