Friday, September 13, 2013

బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీ

న్యూఢిల్లీ,సెప్టెంబర్ 13:  అందరి ఏకాభిప్రాయంతో నరేంద్ర మోడీని బీజేపీ తరఫున ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేసినట్టు  బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు.  నరేంద్ర మోడీ మాట్లాడుతూ,  ''దేశం సంక్షోభంలో ఉంది.. ఇలాంటి సమయంలో ఈ సంక్షోభం నుంచి దేశాన్ని బయటపడేసేందుకు బీజేపీ తరఫున పోరాటం చేస్తాం. చిన్న కుగ్రామం నుంచి.. అతి చిన్న కుటుంబం నుంచి.. ఓ కార్యకర్త స్థాయి నుంచి వచ్చిన నాలాంటి సాధారణ వ్యక్తికి పార్టీ జాతీయ నాయకత్వం అతిపెద్ద బాధ్యత అప్పగించింది. 2014 ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించాలంటే ప్రజల మనోభావాలను, కార్యకర్తలు, నేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ముందుకెళ్లాలి. వాజ్ పేయి, అద్వానీ లాంటి పెద్దల కృషితో వటవృక్షంలా ఎదిగిన ఈ పార్టీ నీడన ఉన్న కార్యకర్తలందరికీ వినమ్రంగా నమస్కరిస్తున్నా. పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకు శ్రమించడానికి ఏమాత్రం వెనకాడను. సామాన్యుల ఆశలు, ఆకాంక్షలు నెరవేరుస్తాను. ఇక్కడున్న అందరి ద్వారా కోట్లాది మంది భారతీయుల ఆశీస్సులు కోరుతున్నాను.  కష్టాల్లో ఉన్న ఈ దేశాన్ని కాపాడేందుకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి భారతీయుడు బీజేపీ కమలాన్ని తీసుకుని, ఒక కొత్త ఆశతో బీజేపీకి పూర్తిగా సమర్థిస్తారని ఆశిస్తున్నాను. '' అని  మోడీ తెలిపారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...