చెన్నై, ఆగస్టు 21 : ప్రముఖ రచయిత్రి, కాలమిస్ట్ మాలతీ చందూర్ (87) కన్నుమూశారు. గత కొంతకాలంగా మాలతీ చందూర్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు. చెన్నైలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఆమె మృతి చెందారు. తొలి మహిళ కాలమిస్టుగా గుర్తింపు సాధంచిన మాలతీ చందూర్ 1930వ సంవత్సరంలో కృష్ణా జిల్లాలోని నూజివీడులో జన్మించారు. ఎక్కువగా చదువుకోక పోయినా ఆమె చిన్ననాటినుంచే నవలు, కథలు, విజ్ఞాన శాస్త్ర పుస్తకాలు ఎక్కువగా చదివేవారు. రచనలను కేవలం చదవడమే కాకుండా వాటిని విశ్లేషించడం ఆమె ప్రత్యేకత. ఆంధ్రప్రభ పత్రికలో వచ్చే ‘ప్రమాదవనం’ అనే ఫీచర్తో మాలతీ చందూర్ మంచి గుర్తింపు పొందారు. ఇంకా అనేక పత్రికలకు వివిధ రకాల శీర్షికలను అందించారు. మాలతి చందూర్ దాదాపు ఆరు దశాబ్దాలుగా చెన్నైలో నివసిస్తునారు. కేవలం రచయిత్రిగానే కాకుండా ఆమె జగతి అనే మాసపత్రికు ఎడిటర్తో పాటు, జర్నలిస్ట్ గా పనిచేశారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment