Tuesday, August 20, 2013

ఆంటోనీ కమిటీ చెవిలో ' సమైక్య ' శంఖం...

న్యూఢిల్లీ,ఆగస్టు 20:  రాష్ట్ర విభజన వల్ల తలెత్తే సమస్యలను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆంటోనీ కమిటీ కి వివరించారు.  దాదాపు నలబై నిమిషాల పాటు జలవనరులు, విద్యుత్తు, ఉపాధి, నక్సలిజం, హైదరాబాద్ విషయాల్లో తలెత్తే సమస్యలను ఆయన వివరించినట్టు సమాచారం. రెండు ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే రాష్ట్రం ఐక్యంగానే ఉండాలని ఆయన సూచించారు.  విభజన రెండు ప్రాంతాలకు కూడా నష్టమేనని ఆయన చెప్పారుట.  రాష్ట్ర విభజనపై పునరాలోచన చేయాలని ఆయన సూచించారని భోగట్టా.   అయితే, రాష్ట్ర విభజనపై నిర్ణయం జరిగిపోయిందని, వెనక్కి వెళ్లలేమని ఆంటోనీ కిరణ్ కుమార్ రెడ్డితో చెప్పినట్లు సమాచారం.  కాగా, ఆంటోనీ కమిటీ ముందు సీమాంధ్ర రాష్ట్ర మంత్రులు, శానససభ్యులు, ఎమ్మెల్సీలు కూడా  సమైక్యవాదాన్ని వినిపించారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని తాము కోరినట్లు ఆంటోనీ కమిటీతో బేటీ అనంతరం మంత్రి శైలజానాథ్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. రాయలసీమ, ఆంధ్ర, హైదరాబాద్ ప్రాంతాల ప్రజలు సమైక్యాన్ని కోరుకుంటున్నట్లు తాము చెప్పినట్లు ఆయన తెలిపారు. విఫజన జరిగితే ఇంతకన్నా పెద్ద సమస్యలు తలెత్తుతాయని చెప్పినట్లు తెలిపారు. నదీజలాలు, ఉపాధి కల్పన, ఆర్థికాభివృద్ధి తదితర విషయాల్లో ఇరు ప్రాంతాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని వివరించినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రానికి రావాలని ఆంటోనీ కమిటీని కోరినట్లు ఆయన తెలిపారు. విభజన వల్ల తలెత్తే సమస్యలను తాము వివరించినట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్‌పైనా చర్చించామని ఆయన తెలిపారు. హైదరాబాదులో సీమాంధ్రులకు రక్షణ ఉండదని చెప్పినట్లు ఆయన తెలిపారు. తాము చెప్పిన విషయాలను సావధానంగా విన్నారని, రాష్ట్రంలో పర్యటించాలని ఆంటోనీ కమిటీని కోరామన ఆయన చెప్పారు.సీమాంధ్ర నాయకులు దాదాపు రెండు గంటల పాటు ఆంటోనీ కమిటీతో సమావేశమయ్యారు.  సీమాంధ్ర నేతలతో ఆంటోనీ కమిటీ భేటీ అనంతరం దిగ్విజయ్ సింగ్  మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కుంటున్నారని  అన్నారు. ఈ నెల 26, 27, 28 తేదీల్లో మళ్లీ సమావేశమవుతామని ఆయన చెప్పారు. సీమాంధ్ర నేతల అభిప్రాయాలను తాము సావధానంగా విన్నట్లు ఆయన తెలిపారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...