హైదరాబాద్, ఆగష్టు 30 : తెలుగువారికి గుర్తింపు తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పామని, ఆత్మ గౌరవంతో ప్రపంచాన్నే జయించవచ్చునని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చగొట్టడం బాధాకరంగా ఉందని, విభజన రాజకీయ ప్రయోజనాలకోసమేనని, జాతి ప్రయోజనాలకు కాదని ఆయన ఒక చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో పేర్కొన్నారు. 30 రోజుల నుంచి రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంటే కేంద్రం పట్టించుకోవడం లేదని చంద్రబాబు విమర్శించారు. అసలు విభజనకు బీజం వేసింది వైఎస్సేనని, 1999లో ఎమ్మెల్యేలను ఢిల్లీకి పంపించారని, అప్పటి నుంచే ఈ కార్యక్రమం మొదలైందని చంద్రబాబు పేర్కొన్నారు. వి వైసీపీ, టీఆర్ఎస్ పార్టీలను అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నదని ఆయన ఆరోపించారు. తెలుగుదేశం పార్టీని దెబ్బ తీయాలనే కుట్రతో తెలుగు జాతినే దెబ్బతీయాలనే పరిస్థితికి వచ్చారనిబాబు విమర్శించారు. కాంగ్రెస్ కుట్రలను రాష్ట్ర ప్రజలకు వివరించేదుకే సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి బస్సు యాత్ర చేస్తున్నట్లు చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి గురువారం రవీంధ్రభారతిలో చేసిన వ్యాఖ్యలు నిర్ణయానికి ముందు ఎందుకు చెప్పలేదని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. తెలుగు జాతి కోసం హైదరాబాద్ను అభివృద్ధి చేశామని, సైబరాబాద్ సిటీని నిర్మించామని, తొమ్మిదేళ్ళ పాలనలో దేశంలో ఎక్కడా జరగని అభివృద్ధి చేసి చూపించామని, తెలుగువారి ప్రతిష్ట కోసం ప్రపంచమంతా తిరిగామని ఆయన అన్నారు. రాష్టంలోని పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయంతో కాంగ్రెస్ భయపడి ఇలాంటి తొందపాటు నిర్ణయాలు తీసుకుందని చంద్రబాబు నాయుడు విమర్శించారు. తెలుగుజాతికి సంబంధించిన వ్యవహారాన్ని కాంగ్రెస్ సొంత వ్యవహారంలా చేసిందని ఆయన అన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment