Thursday, July 11, 2013

తెలంగాణ ఇస్తామని హామీఇవ్వలేదు...రెండో ఎస్సార్సీపై మాత్రమే ఇచ్చాం...దిగ్విజయ్‌

న్యూఢిల్లీ, జులై 11: తెలంగాణ ఇస్తామని 2004 ఎన్నికల్లో కాంగ్రెస్  హామీ ఇవ్వలేదని  పార్టీ రాష్ట్రవ్యవహారాల ఇంచార్జి అన్నారు.  ఎన్నికల మ్యానిఫెస్టోలో  రెండో ఎస్సార్సీ ఏర్పాటు చేస్తామని మాత్రమే హామీ ఇచ్చినట్లు దిగ్విజయ్‌సింగ్ ఒక వార్తా సంస్థ కి ఇచ్చిన  ఇంటర్వ్యూలో చెప్పారు.  రాజ్యాంగ సవరణ చేయవలసి ఉన్నందున తెలంగాణ విషయమై యుపిఏ మిత్రపక్షాలు, ప్రతిపక్షాలతో సంప్రదించవలసి ఉంటుందని చెప్పారు. అస్పష్టతకు తావులేని విధంగా నిర్ణయం ఉంటుందని చెప్పారు.అయితే తెలంగాణ అంశంపై నిర్ణయాన్ని ఇక వాయిదా వేసే పరిస్థితి లేదన్నారు.  సమైక్యమా? తెలంగాణ? అనే విషయంలో  గందర గోళానికి తావు లేకుండా నిర్ణయం ఉంటుందని చెప్పారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...