Saturday, June 29, 2013

చెలరేగిన గేల్ ----శ్రీలంక పై విండీస్ గెలుపు

జమైకా, జూన్ 29:  ముక్కోణపు క్రికెట్ టోర్నిలో శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్ లో ఓపెనర్ క్రిస్ గేల్ సెంచరీ సాధించడంతో వెస్టిండీస్ జట్టు ఇంకా 73 బంతులుండగానే 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ జట్టులో క్రిస్ గేల్ 100 బంతుల్లో 9 ఫోర్లు 7 సిక్సర్లతో 109 పరుగులు చేశాడు. చార్లెస్ 29, బ్రావో 27,శ్యామ్యూల్ 15 పరుగులు చేశాడు. కులశేఖర, హెరాత్ కు చెరో వికెట్ లభించింది. టాస్ గెలిచి వెస్టిండీస్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ కు దిగిన శ్రీలంకను స్పిన్నర్ నరైన్ దెబ్బ తీశాడు. నరైన్ 4 వికెట్లతో టాప్ ఆర్డర్ ను కుప్పకూల్చాడు. నరైన్ కు తోడు రాంపాల్ మూడు వికెట్లు, బ్రావో రెండు, శ్యామ్యూల్ ఒక వికెట్ పడగొట్టాడు. దాంతో శ్రీలంక జట్టు 48.3 ఓవర్లలోనే 208 పరుగులకు ఆలౌటైంది.  ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా క్రిస్ గేల్ ఎంపికయ్యాడు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...