జమైకా, జూన్ 29: ముక్కోణపు క్రికెట్ టోర్నిలో శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్ లో ఓపెనర్ క్రిస్ గేల్ సెంచరీ సాధించడంతో వెస్టిండీస్ జట్టు ఇంకా 73 బంతులుండగానే 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ జట్టులో క్రిస్ గేల్ 100 బంతుల్లో 9 ఫోర్లు 7 సిక్సర్లతో 109 పరుగులు చేశాడు. చార్లెస్ 29, బ్రావో 27,శ్యామ్యూల్ 15 పరుగులు చేశాడు. కులశేఖర, హెరాత్ కు చెరో వికెట్ లభించింది. టాస్ గెలిచి వెస్టిండీస్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ కు దిగిన శ్రీలంకను స్పిన్నర్ నరైన్ దెబ్బ తీశాడు. నరైన్ 4 వికెట్లతో టాప్ ఆర్డర్ ను కుప్పకూల్చాడు. నరైన్ కు తోడు రాంపాల్ మూడు వికెట్లు, బ్రావో రెండు, శ్యామ్యూల్ ఒక వికెట్ పడగొట్టాడు. దాంతో శ్రీలంక జట్టు 48.3 ఓవర్లలోనే 208 పరుగులకు ఆలౌటైంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా క్రిస్ గేల్ ఎంపికయ్యాడు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment