Monday, May 27, 2013

మహానాడులోనూ అరిగిపోయిన రికార్డే...

హైదరాబాద్, మే 27 : 'వస్తున్నా..మీకోసం' పాదయాత్ర తన జీవితంలో మరువరాని ఘట్టం అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సోమవారం  గండిపేటలో  32వ టీడీపీ మహానాడులో బాబు ప్రసంగించారు. పాదయాత్రలో తనను నడిపించింది కార్యకర్తలే అని ఆయన తెలిపారు. సమాజంలో మార్పు, అవినీతి ప్రక్షాళన కోసం యువత ముందుకు రావాలని బాబు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ దుష్టపాలన వల్ల రాష్ట్ర నష్టపోయిందని ధ్వజమెత్తారు. దేశంలో మహిళలకు రక్షణ కరువైందని, అసమర్థ ప్రభుత్వంతో రాష్ట్రంలో సమస్యలు పెరిగిపోయాయని వ్యాఖ్యానించారు. విద్యుత్ సమస్యతో పరిశ్రమలు మూతపడ్డాయని, వ్యవసాయం పూర్తిగా దెబ్బతిందన్నారు. విద్యుత్ సమస్యతో 30 లక్షల మంది ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మహస్తం మొండిహస్తం అన్న తన వ్యాఖ్యలు  నిజమయ్యాయన్నారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని, బెల్టుషాపులను వెంటనే రద్దు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చారని మండిపడ్డారు. పేదల భూముల కారుచౌకగా కొట్టేసి పెత్తందార్లకు కట్టబెట్టారని ఆరోపించారు. టీడీపీ హయాంలో 11 వేల కోట్లు ఖర్చుపెట్టి 30 లక్షల ఎకరాలకు నీరిచ్చామని, కాంగ్రెస్ ప్రభుత్వం రూ.80 వేల కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరాకు నీరివ్వలేకపోయిందని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వస్తే రైతు రుణ మాఫీ చేసి తీరుతామని స్పష్టం చేశారు. సీబీఐ అన్ని చార్జిషీట్లలో జగన్‌ను దోషిగా చూపించారని, జగన్ అరెస్ట్ అయినా...దొంగమంత్రులు కొనసాగుతున్నారన్నారు. కళంకిత మంత్రులను వెంటనే బర్తరఫ్ చేయాలని బాబు డిమాండ్ చేశారు. టీడీపీ పోరాటం వల్లే ఇద్దరు మంత్రులు రాజీనామా చేశారని తెలిపారు. పార్టీలో అవినీతిపరులను ఉపేక్షించబోమని, అవినీతిపరులు చరిత్రహీనులుగా మిగిలిపోతారని చంద్రబాబు పేర్కొన్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...