Saturday, February 16, 2013

తెలంగాణపై అధ్యయనానికి రాహుల్ కు మూడు నెలలు కావాలిట...


న్యూఢిల్లీ,ఫిబ్రవరి 16: తెలంగాణ అంశాన్ని లోతుగా అధ్యయనం చేయటానికి, ప్రాధమికంగా ఒక అభిప్రాయానికి రావటానికి మూడు నెలల సమయం కావాలని కాంగ్రెస్ యువనేత, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పేర్కొన్నట్లు సమాచారం. పీసీసీ చీఫ్‌లు, సీఎల్‌పీ నేతలతో రాహుల్  భేటీ సందర్భంగా తెలంగాణ అంశం చర్చకు వచ్చింది. ఈ అంశాన్ని త్వరగా తేల్చాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. కాగా,  పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ నాయకులు కూడా  తెలంగాణ అంశంపై ఆచితూచి అడుగులు వేయాలని రాహుల్‌కు సూచించినట్లు తెలిసింది. దీనిపై నెమ్మదిగా ముందుకు సాగాలని, లేదంటే తమ రాష్ట్రాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశముందని వారు హెచ్చరించినట్లు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ అంశాన్ని లోతుగా అధ్యయనం చేసి, ఒక ప్రాధమిక అభిప్రాయానికి రావటానికి తనకు మూడు నెలల సమయం కావాలని రాహుల్ పేర్కొన్నట్లు సమాచారం.
 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...