Friday, January 25, 2013

రామానాయుడికి పద్మ భూషణ్,బాపుకు పద్మశ్రీ

న్యూఢిల్లీ, జనవరి 25: గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 'పద్మ’అవార్డులను  ప్రకటించింది. దేశ వ్యాప్తంగా నలుగురికి పద్మ విభూషణ్ అవార్డులు దక్కగా, 24 మందికి పద్మ భూషణ్ అవార్డులు లభించాయి. 80 మందికి పద్మశ్రీ అవార్డుల దక్కాయి. రాష్ట్రం నుంచి ప్రముఖ సినీ నిర్మాత డి. రామానాయుడికి పద్మ భూషణ్ అవార్డు లభించగా, డా. చిట్టా వెంకట సుందరం, ఎం రామకృష్ణరాజులకు పద్మశీ పురస్కారాలు దక్కాయి. దర్శకుడు  బాపుకు తమిళనాడు కోటాలో పద్మశ్రీ పురస్కారం దక్కింది. నానాపటేకర్, డా. రాధిక, శ్రీదేవి, సురభి బాబ్జి, జి. అంజయ్య, రాహుల్ ద్రవిడ్‌లకు పద్మశ్రీ పురస్కారాలు లభించాయి. రాష్ట్రం నుంచి 8 మందికి 'పద్మ' పురస్కారాలు లభించాయి.  

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...