Tuesday, January 15, 2013

రెండవ వన్డేలో భారత్ ఘన విజయం

కోచి, జనవరి 15:  ఇంగ్లాండ్ తో కోచిలో జరిగిన రెండవ వన్డేలో భారత జట్టు భారీ స్కోరు తేడాతో ఘన విజయం సాధించింది. 286 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ దిగిన ఇంగ్లాండ్ ఆటగాళ్లను భారత బౌలర్లు షమీ, భువనేశ్వర్ కుమార్. జడేజా, అశ్విన్ లు కట్టడి చేశారు. దాంతో ఇంగ్లాండ్ జట్టు ఒత్తిడికి లోనై వెంట వెంటనే వికెట్లను కోల్పోయింది. ఇంగ్లాండ్ జట్టు 36 ఓవర్లలోనే 158 పరుగులకు కుప్పకూలింది. దాంతో భారత్ కు 127 పరుగుల తేడాతో భారీ విజయం దక్కింది భువనేశ్వర్, అశ్విన్ లు మూడేసి, జడేజాకు రెండు వికెట్లు, షమీకి ఒక వికెట్ లభించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 285 పరుగులు చేసింది. ధోని 72, జడేజా 61, రైనా 55, కోహ్లీ 37, యువరాజ్ 32 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఫిన్, డెర్న్ బాచ్ రెండేసి వికెట్లు, వోక్స్, ట్రెడ్ వెల్ చెరో వికెట్ పడగొట్టారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...