Thursday, January 24, 2013

ఉరి వద్దు--20 ఏళ్ళ జైలే సరి...

గ్యాంగ్‌రేప్ లపై వర్మ కమిటీ సిఫార్సు
న్యూఢిల్లీ, జనవరి 23: సామూహిక అత్యాచారాలకు పాల్పడే కీచకులకు కనీసం 20 ఏళ్ల జైలు శిక్షలు విధించాలని జస్టిస్ జె.ఎస్.వర్మ కమిటీ సిఫార్సు చేసింది. ఢిల్లీ గ్యాంగ్‌రేప్ ఘటన నేపథ్యంలో మహిళలపై నేరాలకు సంబంధించిన చట్టాల్లో సవరణలు సూచించేందుకు ఏర్పాటైన ఈ కమిటీ బుధవారం తన 630 పేజీల నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. దేశంలో మహిళలపై నేరాలు పెరగడానికి ప్రభుత్వ పాలనా వైఫల్యం, పోలీసుల స్పందనారాహిత్యం, లింగ వివక్ష కారణమని,   ప్రస్తుత చట్టాలను సరిగ్గా అమలు చేయడం ద్వారా మహిళలపై నేరాలను అరికట్టే అవకాశం ఉన్నా ప్రభుత్వ అసమర్థత వల్ల అది సాధ్యం కావడంలేదని  కమిటీ  విమర్శించింది.  అత్యాచారం, హత్యలకు పాల్పడే వారికి జీవితాంతం జైలు శిక్షలు విధించాలని సూచించింది. లైంగిక నేరాలకు పాల్పడే పోలీసు, ప్రజాప్రతినిధులు సహా అత్యాచార దోషులందరికీ కఠిన శిక్షలు విధించేలా క్రిమినల్ చట్టాలను సవరించాలని కోరింది. అయితే  అత్యాచార దోషులకు ఉరిశిక్షలు విధించడం సరైన విధానం కాదని...శరీర అవయవాలను గాయపరిచేందుకు రాజ్యాంగం అంగీకరించదని తెలిపింది.  బాల నేరస్థుల  వయసును ప్రస్తుతమున్న 18 ఏళ్ల నుంచి 16 ఏళ్లకు తగ్గించాలన్న డిమాండ్‌ను కూడా కమిటీ తోసిపుచ్చింది. వివిధ వర్గాల ప్రజల నుంచి అందిన సుమారు 80 వేల సూచనలను పరిగణనలోకి తీసుకున్న కమిటీ కేవలం 29 రోజుల్లో ఈ నివేదికను రూపొందించింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...