హైదరాబాద్, నవంబర్ 14: ఎంఐఎం పార్టీపై కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడికి దిగింది. కాంగ్రెస్ మతతత్వ పార్టీ అని ఎంఐఎం ఆరోపించడం బాధాకరమని, ఎంఐఎం వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ నేతలు బొత్స, షబ్బీర్ అలీ అన్నారు. కాంగ్రెస్ ఒక్కటే సెక్యూలర్ అని ఎంఐఎం నేత అసదుద్దీన్ చాలా సందర్భాల్లో చెప్పారని, పార్లమెంట్లో కూడా అసదుద్దీన్ అంగీకరించారని బొత్స, షబ్బీర్ అలీ అన్నారు. ఇన్నేళ్లుగా కాంగ్రెస్లో కనిపించని మతతత్వం ఇప్పుడే కనిపించిందా అని ప్రశ్నించారు.మతసామరస్యాన్ని కాపాడటమే తప్పా అని అన్నారు. ఎంఐఎం వైఖరిలో మార్పుకోసం నిరీక్షించలేమని, కాంగ్రెస్ విధానాలు, సిద్ధాంతాలు నచ్చినవారితోనే తాము కలిసి ఉంటామన్నారు. 2014 వరకు రాష్ట్ర సర్కారుకు వచ్చిన ఇబ్బందేమీ లేదని బొత్స, షబ్బీర్ అలీ స్పష్టం చేశారు.
చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయ అంశం చాలా సున్నితమైంది, చాలా చిన్నదని, దానిపై రాద్ధాంతం చేయడం ఎంఐఎంకు సరికాదని అన్నారు.
చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయ అంశం చాలా సున్నితమైంది, చాలా చిన్నదని, దానిపై రాద్ధాంతం చేయడం ఎంఐఎంకు సరికాదని అన్నారు.
No comments:
Post a Comment