షిర్డీ సాయి కానుకల వేలం

షిర్డీ, అక్టోబర్ 14: షిర్డీ సాయిబాబా ఆలయానికి భక్తులు సమర్పించిన విలువైన కానుకలను  ఈ నెల 18 నుంచి వేలం వేయనున్నట్టు  శ్రీసాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ తెలిపింది. వీటిలో వెండి, బంగారు, రత్నాలు, వజ్రాలు, ఖరీదైన రాళ్లతో తయారైన కిరీటాలు, హారాలు, పాదుకలు తదితర వస్తువులున్నాయి. మొత్తం 32 కేజీల వెండి, 18 కేజీల బంగారు కానుకలు, 52 విలువైన రత్నాలు, వజ్రాలను వేలం వేయనున్నట్లు  ట్రస్ట్ ప్రతినిధి తెలిపారు. 18న వెండి, వచ్చే నెల 1న బంగారు, 8న విలువైన రాళ్లను వేలం వేస్తామన్నారు. ఇందులో పాల్గొనే వారు రూ.10 వేల రీఫండబుల్ డిపాజిట్‌ను చెల్లించాల్సి ఉంటుంది .  సాయి కి వచ్చిన కానుకలను కొనుక్కోవడానికి భక్తులు మొగ్గచూపడంతో వాటిని  కరిగించకుండా వేలం వేస్తున్నారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు