లోక్‌సభ ఉపఎన్నికలో ప్రణబ్ తనయుని గెలుపు

కోల్ కతా, అక్టోబర్ 13:  పశ్చిమ బెంగాల్ లోని జంగీపూర్‌ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తనయుడు అభిజిత్ ముఖర్జీ స్వల్ప మైజార్టీతో గెలుపొందారు. సమీప సీపీఎం అభ్యర్థి ముజాఫర్ హుస్సేన్ పై 2,536 ఓట్ల తేడాతో ఆయన విజయం సాధించారు. అభిజిత్ కు 3,32,919 ఓట్లు రాగా, హుస్సేన్ కు 3,30,383 ఓట్లు వచ్చాయి. 2009లో ఇక్కడ నుంచి పోటీ చేసిన ప్రణబ్ ముఖర్జీ 1.28 లక్షల ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు