Thursday, October 11, 2012

మూడు రోజుల్లోనే తత్కాల్ పాస్‌పోర్టులు

హైదరాబాద్, అక్టోబర్ 11:  రాష్ట్రంలో మరో రెండు మినీ పాస్‌పోర్టు సేవా కేంద్రాలను నెలకొల్పనున్నట్టు సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి డాక్టర్ శ్రీకర్‌రెడ్డి వెల్లడించారు. కరీంనగర్, భీమవరంలలో 4 నెలల్లోనే వీటిని అందుబాటులోకి తెస్తామన్నారు. ఆధార్‌కార్డు అమలులోకి వస్తే పాస్‌పోర్టు జారీ ప్రక్రియ మరింత సులభతరమవుతుందని చెప్పారు. స్థానిక పోలీసు విచారణలో జాప్యం కారణంగానే పాస్‌పోర్టు జారీ ఆలస్యమవుతోందని తెలిపారు. తత్కాల్ కింద కేవలం మూడు రోజుల్లోనే పాస్‌పోర్టు జారీ చేస్తున్నట్టు ఆయన చెప్పారు. పాస్‌పోర్టు కోసం ఏజెన్సీలను సంప్రదించి మోసపోవద్దని దరఖాస్తుదారులకు శ్రీకర్‌రెడ్డి సూచించారు. ఏజెన్సీలు నకిలీ పత్రాలు సృష్టించి, ఫోర్జరీ సంతకాలు చేసి పాస్‌పోర్టులు అందజేస్తున్నాయని, ఈ విషయం విచారణలో బయటపడితే దరఖాస్తుదారులే ఇబ్బంది పడతారని హెచ్చరించారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...