న్యూఢిల్లీ,అక్టోబర్ 3: కాంగ్రెసు పార్టీ అధిష్టానంతో జరిపిన చర్చలు ఫలఫ్రదంగా ముగిశాయని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు. బుధవారం హైదరాబాదు బయలుదేరే ముందు ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. పలువురు నేతలతో తాను తెలంగాణ అంశంపై చర్చించానని, త్వరలో సానుకూల నిర్ణయం వెలువడుతుందని చెప్పారు. మీడియాకు తెలిసి కొందరితోనే భేటీ అయ్యానని కానీ, తెలియకుండా చాలామందితో చర్చించానని చెప్పారు. కాంగ్రెసు పార్టీ ఆహ్వానం మేరకే తాను ఢిల్లీకి వచ్చానన్నారు. గత నెల నాలుగో తారీఖున పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యేందుకు ఢిల్లీ వెళ్లిన కె.సి.ఆర్. పార్లమెంటు సమావేశాలు రెండు రోజులే జరిగినప్పటికీ అప్పటి నుండి నెల రోజుల పాటు అక్కడే ఉండిపోయారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment