Tuesday, October 23, 2012

ఉరికి చేరువలో కసబ్...

న్యూఢిల్లీ, అక్టోబర్ 23:  ముంబై కాల్పుల ఘటనలో ఉరిశిక్ష పడిన ఉగ్రవాది అజ్మల్ కసబ్ పెట్టుకున్న  క్షమాభిక్ష పిటిషన్‌ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మంగళవారం తోసిపుచ్చింది. ఈ మేరకు హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రపతి భవన్‌కు సమాచారం అందించింది. కసబ్ మెర్సీ పిటిషన్‌ను తోసిపుచ్చాలని హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రపతిని కోరింది. తనకు క్షమాభిక్ష ప్రసాదించి, ఉరిశిక్షను జీవితఖైదుగా మార్చాలని కసబ్ రాష్ట్రపతికి పిటిషన్ పెట్టుకున్నాడు. దీనిపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. కసబ్ క్షమాభిక్ష పిటిషన్‌ను తోసిపుచ్చాలని ఇంతకు ముందు మహారాష్ట్ర హోం మంత్రిత్వ శాఖ కూడా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కోరింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...