Monday, October 8, 2012

వరల్డ్ టీ-20 జట్టులో కోహ్లీ, రైనా

కొలంబో, అక్టోబర్ 8:    వరల్డ్  టీ-20 జట్టును ఐసీసీ ప్రకటించింది. కెప్టెన్‌గా జయవర్ధనేను ఎంపిక చేశారు. జట్టులో విరాట్ కోహ్లీ, సురేష్ రైనాలకు స్థానం దక్కింది. 
ఇలావుండగా,  ట్వంటీ 20 ప్రపంచ కప్‌ను శ్రీలంక జారవిడుచుకున్న నేపథ్యంలో కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని మహేలా జయవర్ధనే నిర్ణయించుకున్నారు. నాలుగు ప్రపంచ కప్ ఫైనల్ ఆడిన మహేలా జయవర్ధనే తన దేశానికి కప్ అందించడంలో మాత్రం విఫలమయ్యారు. తాను సెలెక్టర్లతో మాట్లాడుతానని, శ్రీలంక ట్వంటీ20 జట్టు కెప్టెన్‌గా తప్పుకోవాలని నిర్మయించుకున్నానని ఆయన వెస్టిండీస్‌పై ఓటమి తర్వాత చెప్పారు. జయవర్దనే వికెట్ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. జయవర్ధనే  కొద్దిసేపు క్రీజులో నిలబడి ఉంటే ఫలితం భిన్నంగా ఉండేది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...