తెలంగాణ ఒక్కటే సమస్యా ? వాయలార్
న్యూఢిల్లీ, అక్టోబర్ 16 : దేశంలో తెలంగాణ ఒక్కటే సమస్య కాదని ఇంకా చాలా సమస్యలు ఉన్నాయని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, కేంద్రమంత్రి వాయలార్ రవి మంగళవారం అన్నారు. తెలంగాణపై చర్చల ప్రక్రియ ఆగిపోలేదని, అందరితోనూ చర్చిస్తున్నామని, అయితే చర్చలు ఎప్పటిలోగా ముగుస్తాయో ఖచ్చితంగా చెప్పలేమని అన్నారు. కేంద్రం, కాంగ్రెసు పార్టీ కూడా సాధ్యమైనంత త్వరగా సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశం తో ఉన్నాయని చెప్పారు.
Comments