ఎంబీఏ, ఎంసీఏ ఫీజుల పెంపు... 12 నుంచి కౌన్సిలింగ్
హైదరాబాద్,అక్టోబర్ 9: రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ఫీజులను భారీగా పెంచారు.. రెండు కోర్సులలో కనీస ఫీజుని 27 వేల రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఎంసీఏ గరిష్ట ఫీజు 88 వేల రూపాయలు, ఎంబీఏ గరిష్ట ఫీజు 71వేల రూపాయలకు పెంచారు. మొత్తం 48 ఎంబీఏ కాలేజీల్లో, 36 ఎంసీఏ కాలేజీలకు ఫీజుల పెంపు వర్తిస్తుంది. ఈ నెల 12 నుంచి రెండు కోర్సులకు ఆన్లైన్లో కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు.
Comments