ప్రపంచకప్ ట్వంటీ 20లో ఇంగ్లండ్ ఇంటికి...

పల్లెకలె,అక్టోబర్ 1:  ప్రపంచకప్ ట్వంటీ 20లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ కథ ముగిసింది. సూపర్‌ఎయిట్‌లో  శ్రీలంకతో తలపడిన ఇంగ్లండ్ 19 పరుగుల తేడాతో ఓటమి చెంది టోర్నీ నుంచి నిష్ర్కమించింది. 170 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ఇంగ్లండ్ 150 పరుగులకే పరిమితమైంది. ఇంగ్లండ్ ఆటగాళ్లలో ఒక్క పటేల్(67) పరుగుల మినహా ఎవరూ రాణించకపోవడంతో ఓటమి తప్పలేదు. చివర్లో స్వాన్ (34) పరుగలతో రాణించినా ప్రయోజనం లేక పోయింది. అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన  శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది.  గ్రూప్-1 నుంచి శ్రీలంక, వెస్టిండీస్‌లు సెమీస్‌కు అర్హత సాధించగా, కివీస్, ఇంగ్లండ్‌లు ఇంటిదారి పట్టాయి. వరుస మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన శ్రీలంక అగ్రస్థానంలో కొనసాగుతోంది.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు