కొత్తగ్యాస్ కనెక్షన్ల డిపాజిట్ పెంపు

హైదరాబాద్,అక్టోబర్ 9:  కొత్త గ్యాస్  కనెక్షన్లకు డిపాజిట్ పెంచుతూ చమురు కంపెనీలు మంగళవారం నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటివరకు సింగిల్ సిలిండర్ కనెక్షన్‌కు రూ.1,250తో పాటు రెగ్యులేటర్ చార్జీ కింద రూ.150 వసూలు చేస్తుండగా,  తాజాగా సింగిల్ సిలిండర్ డిపాజిట్‌ను రూ. 1,450కు పెంచారు. రెగ్యులేటర్‌తో కలిపితే ఇది రూ.1,600 అవుతుంది. రెండో సిలిండర్ తీసుకోవాలంటే మరో రూ.1,450 చెల్లించాలని గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులు చెబుతున్నారు. మూడేళ్లక్రితం సిలిం డర్ డిపాజిట్ రూ.900 ఉండేది. దాన్ని తర్వాత రూ. 1,250కు పెంచారు. ఇప్పుడిది రూ.1,450 అయ్యింది. 

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు