Friday, October 12, 2012

ఐపీఎల్‌లో స్థానం కోల్పోయిన డెక్కన్ చార్జర్స్

ముంబయి,అక్టోబర్ 12: ఐపీఎల్‌ లో డెక్కన్ చార్జర్స్ స్థానం కోల్పోయింది. ముంబయి హైకోర్టు ముందు రు. 100 కోట్లు బ్యాంకు గ్యారంటీని గడువులోగా చెల్లించనందున డెక్కన్ చార్జర్స్ ఐపీఎల్ కాంట్రాక్ట్ ను  రద్దు చేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. గతంలో డెక్కన్ చార్జర్స్ కాంట్రాక్టును రద్దు చేస్తూ బీసీసీఐ ప్రకటించడంతో ప్రాంచైజీ యాజమాన్యం డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తమకు అక్టోబర్ 15 వరకూ గడువు కావాలని డెక్కన్ ప్రాంచైజీ కోరడంతో న్యాయస్థానం తిరస్కరించింది. న్యాయస్థానం ఇచ్చిన గడువులోగా డెక్కన్ డెక్కన్ చార్జర్స్ బ్యాంకు గ్యారంటీని చెల్లించకపోవడంతో తదుపరి ఐపీఎల్‌లో స్థానం కోల్పోయింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...