జగన్ రిమాండ్ నవంబర్ 8 వరకు పొడిగింపు
హైదరాబాద్, అక్టోబర్ 25: అక్రమాస్తుల వ్యవహారంలో వైఎస్ జగన్ రిమాండ్ను సీబీఐ ప్రత్యేక కోర్టు నవంబర్ 8 వరకు పొడిగించింది. ఇదే కేసులో నిందితులు మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, వాన్పిక్ సంస్థల అధినేత నిమ్మగడ్డ ప్రసాద్, ఐఆర్ఏఎస్ అధికారి బ్రహ్మానందరెడ్డిల రిమాండ్ను కూడా వచ్చేనెల 8 వరకు పొడిగించింది. రిమాండ్ ముగియడంతో గురువారం వీరిని చంచల్గూడ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్రావు ఎదుట హాజరుపరిచారు.