కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు
న్యూఢిల్లీ,డిసెంబర్ 12: ప్రముఖ పారిశ్రామికవేత్త విజయమాల్యాకు చెందిన పౌర విమానయాన సంస్థ కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ డిసెంబర్ 15 నుంచి ఏడు రూట్లలో కొత్తగా 14 విమానాలను ప్రారంభినున్నట్లు ప్రకటించింది.న్యూఢిల్లీ-హైదరాబాద్, న్యూఢిల్లీ-చెన్నయ్, న్యూఢిల్లీ-భువనేశ్వర్, ముంబయి-లక్నో రూట్లలో ప్రయాణించే ప్రయాణికులకు ఈ కొత్త విమానాలు మరిన్ని ఆప్షన్లను ఇవ్వనున్నాయి.ఈ కొత్త విమానాల వల్ల భారత్లోని మెట్రోపాలిటన్ నగరాలు, ఇతర ముఖ్యమైన పట్టణాల మధ్య కనెక్టివిటీ మెరుగవుతుందని కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ప్రతినిథి తెలిపారు.

Comments