ఆర్ఎస్ఎస్ మాజీ చీఫ్ కెఎస్ సుదర్శన్ మృతి

 రాయ్‌పూర్ ,సెప్టెంబర్ 15:  రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) మాజీ చీఫ్ కెఎస్ సుదర్శన్ కన్నుమూశారు. ఆయన వయస్సు 81 ఏళ్లు.  ఛత్తీస్‌ఘడ్‌లోని రాయ్‌పూర్‌ ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో ఆయన శనివారం ఉదయం 7 గంటలకు తుది శ్వాస విడిచారు.  1954 నుంచి ఆయన ఆర్ఎస్ఎస్‌లో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. 2000 - 2009 మధ్య ఆయన ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఎన్డియే ప్రభుత్వ హయాంలో ఆయన వాజ్‌పేయి, అద్వానీలకు కీలక సూచనలు చేశారు. 2009 మార్చి 31వ తేదీన ఆయన ఆర్ఎస్ఎస్ అధ్యక్ష పదవి నుంచి వైదొలిగారు. 

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు