Saturday, September 15, 2012

ఆర్ఎస్ఎస్ మాజీ చీఫ్ కెఎస్ సుదర్శన్ మృతి

 రాయ్‌పూర్ ,సెప్టెంబర్ 15:  రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) మాజీ చీఫ్ కెఎస్ సుదర్శన్ కన్నుమూశారు. ఆయన వయస్సు 81 ఏళ్లు.  ఛత్తీస్‌ఘడ్‌లోని రాయ్‌పూర్‌ ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో ఆయన శనివారం ఉదయం 7 గంటలకు తుది శ్వాస విడిచారు.  1954 నుంచి ఆయన ఆర్ఎస్ఎస్‌లో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. 2000 - 2009 మధ్య ఆయన ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఎన్డియే ప్రభుత్వ హయాంలో ఆయన వాజ్‌పేయి, అద్వానీలకు కీలక సూచనలు చేశారు. 2009 మార్చి 31వ తేదీన ఆయన ఆర్ఎస్ఎస్ అధ్యక్ష పదవి నుంచి వైదొలిగారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...