హడలెత్తించిన అసీస్...సూపర్ ఎయిట్‌లో శుభారంభం

కొలంబో,సెప్టెంబర్ 28: ప్రపంచకప్ ట్వంటీ 20 టోర్నీలో భాగంగా ప్రేమదాస స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ 9 వికెట్ల తేడాతో భారత్ పై విజయం సాధించి సూపర్ ఎయిట్‌లో శుభారంభం చేసింది.   మాజీ చాంపియన్ భారత్‌ పై ఆసీస్ కేవలం 15 ఓవర్లలో మ్యాచ్‌ను ముగించి గెలుపు స్వంతం చేసుకుంది. 141 పరుగుల విజయలక్ష్యాన్ని   ఆసీస్ కేవలం ఒక వికెట్ టు మాత్రమే కోల్పోయి 14.5 ఓవర్లలో ఛేదించింది. వార్నర్ 63 పరుగులు చేయడంతో మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఆదిలోనే తడబడింది. గంభీర్(17) అనవసరపు రనౌట్‌తో ఆరంభమైన భారత్ పతనం  కడదాకా  కొనసాగింది. యువరాజ్ (8), కోహ్లి (15) , రైనా (26), ధోని (15) పరుగులు చేశారు. ఓ ఎండ్‌లో ఇర్ఫాన్ పఠాన్((31) ఆచి తూచి ఆడటంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. గాయంతో మ్యాచ్‌కు దూరమైన సెహ్వాగ్ లేనిలోటు స్పష్టంగా కనబడింది. ఆసీస్ బౌలర్లలో వాట్సన్ మూడు వికెట్లు తీయగా, కమ్మిన్స్ రెండు, స్టార్క్‌కు ఒక వికెట్టు లభించింది.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు