కొలంబో,సెప్టెంబర్ 28: ప్రపంచకప్ ట్వంటీ 20 టోర్నీలో భాగంగా ప్రేమదాస స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఆసీస్ 9 వికెట్ల తేడాతో భారత్ పై విజయం సాధించి సూపర్ ఎయిట్లో శుభారంభం చేసింది. మాజీ చాంపియన్ భారత్ పై ఆసీస్ కేవలం 15 ఓవర్లలో మ్యాచ్ను ముగించి గెలుపు స్వంతం చేసుకుంది. 141 పరుగుల విజయలక్ష్యాన్ని ఆసీస్ కేవలం ఒక వికెట్ టు మాత్రమే కోల్పోయి 14.5 ఓవర్లలో ఛేదించింది. వార్నర్ 63 పరుగులు చేయడంతో మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఆదిలోనే తడబడింది. గంభీర్(17) అనవసరపు రనౌట్తో ఆరంభమైన భారత్ పతనం కడదాకా కొనసాగింది. యువరాజ్ (8), కోహ్లి (15) , రైనా (26), ధోని (15) పరుగులు చేశారు. ఓ ఎండ్లో ఇర్ఫాన్ పఠాన్((31) ఆచి తూచి ఆడటంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. గాయంతో మ్యాచ్కు దూరమైన సెహ్వాగ్ లేనిలోటు స్పష్టంగా కనబడింది. ఆసీస్ బౌలర్లలో వాట్సన్ మూడు వికెట్లు తీయగా, కమ్మిన్స్ రెండు, స్టార్క్కు ఒక వికెట్టు లభించింది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment