
హైదరాబాద్: ‘మేం వయసుకువచ్చాం’ చిత్రాన్ని అందించిన త్రినాథరావు నక్కిన,యువ హీరో వరుణ్సందేశ్ కలయికలో ఓ చిత్రం రాబోతోంది. గతంలో 4 చిత్రాలు నిర్మించిన ‘సుధా సినిమాస్’ అధినేత జె.సాంబశివరావు ఈ తాజా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యూత్ఫుల్ లవ్ ఎంటర్టైనర్గా రూపొందే ఈ చిత్రం విజయదశమినాడు మొదలవుతుందని సాంబశివరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇద్దరమ్మాయిలు ఈ చిత్రంలో కథానాయికలుగా వుంటారని, వారి ఎంపిక త్వరలో జరుగుతుందని నిర్మాత చెబుతూ ‘సాయికార్తీక్’ సంగీత దర్శకత్వంలో ఈ చిత్రం పాటల రికార్డింగ్ ప్రస్తుతం జరుగుతోందని తెలిపారు.
Comments